కార్పొరేషన్ అధికారుల్లో మార్పు రాకపోతే ఉద్యమం తీవ్రతరం
మీడియా సమావేశంలో సీపీఎం నేతలు హెచ్చరిక
25న భారీ ర్యాలీ – మహా ధర్నా
- కార్పొరేషన్ అధికారుల్లో మార్పు రాకపోతే ఉద్యమం తీవ్రతరం
- మీడియా సమావేశంలో సీపీఎం నేతలు హెచ్చరిక
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గడచిన 20 రోజుల నుండి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు 54 వార్డులలో నిర్వహించడం జరిగిందని… సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మరియు రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ తెలిపారు. యాత్రల సందర్భంగా ప్రజలు అనేక సమస్యలు సిపిఎం కార్యకర్తల.,నాయకుల దృష్టికి తీసుకువచ్చారన్నారు. పాలకులు, అధికారులు ప్రజా సమస్యలు సంక్షేమం గాలికి వదిలేశారని విమర్శించారు. కార్పొరేషన్ అధికారుల,పాలకుల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 25న బారాషాహీద్ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీ – అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట “మహా ధర్నా” కార్యక్రమాన్ని ప్రజలతో కలిసి నిర్వహిస్తున్నామన్నారు. అయినా వైఖరిలో మార్పు రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, నగర రూరల్ కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు.