టీడీపీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా వర్తింపు
నెల్లూరు రూరల్ 18వ డివిజన్లోని ఓ కార్యకర్త ప్రమాదంలో మృతి
కోటంరెడ్డి సోదరుల సహకారంతో రూ.5లక్షల బీమా
చంద్రబాబు, లోకేష్లకు ధన్యవాదాలు తెలిపిన మృతుడి కుటుంబ సభ్యులు
బీమా.. నిజంగానే ఓ ధీమా..!
-టీడీపీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా వర్తింపు
-నెల్లూరు రూరల్ 18వ డివిజన్లోని ఓ కార్యకర్త ప్రమాదంలో మృతి
-కోటంరెడ్డి సోదరుల సహకారంతో రూ.5లక్షల బీమా
-చంద్రబాబు, లోకేష్లకు ధన్యవాదాలు తెలిపిన మృతుడి కుటుంబ సభ్యులు
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా వర్తింప జేసేలా.. వారి కుటుంబ సభ్యులకు ధీమా కల్పించేలా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన ఈ పథకం.. నెల్లూరులోని ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబంలో ఆనందాన్ని నింపింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం.. 18వ డివిజన్.. సర్వేపల్లి కాలువ కట్టపై నివసిస్తున్న మంచాల నవీన్ ఇటీవల వృత్తిరిత్యా పనికి వెళ్లి.. బైక్పై వస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో మరణించాడు. మృతుడు నవీన్ ఎంతో కాలంగా టీడీపీ సభ్యత్వం కలిగి ఉండటంతో.. ఆ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు మురళి.. ఈ విషయాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత గిరిధర్రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు బీమాకు అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి.. అధిష్టానంతో మాట్లాడి మృతుడి కుటుంబానికి రావాల్సిన ప్రమాద బీమా ఐదు లక్షలు వచ్చేలా కృషి చేశారు. ఆ బీమా నగదు కూడా కార్యకర్త కుటుంబ ఖాతాకు జమ చేశారు. దాంతో నవీన్ తల్లి మంచాల జ్యోతి చంద్రబాబు, లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. తమకు ఐదు లక్షలు బీమా రావడానికి కృషిచేసిన కోటంరెడ్డి సోదరులకూ ఆమె కృతజ్ణతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని.. ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఈ బీమా ఓ ధీమా అని.. 18వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి నెల్లూరు మురళీ తెలిపారు. ఈసందర్భంగా వారిద్దరూ మాట్లాడారు.