అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి
గడప గడపకు కోటంరెడ్డి…
- అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు
- ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 42వ రోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని 1వ డివిజన్, కోడూరుపాడు హరిజనవాడలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. డివిజన్కి విచ్చేసిన కోటంరెడ్డికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్లోని గడప గడపకు వెళ్లి ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజల వాస్తవిక సమస్యలు తెలుస్తాయని… రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితోనే గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని గిరిధర్రెడ్డి తెలిపారు.