అక్రమ కేసులకు భయపడం

శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలం

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

టీడీపీ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏఎస్పీ సౌజ‌న్య‌కి

విన‌తి ప‌త్రం అంద‌చేసిన కాకాణి, ఆనం

అక్రమ కేసులకు భయపడం

  • శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలం
  • మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
  • టీడీపీ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏఎస్పీ సౌజ‌న్య‌కి విన‌తి ప‌త్రం అంద‌చేసిన కాకాణి, ఆనం

నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ నేతలపై అక్రమ కేసులకు నిరసనగా.. మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇంచార్జి ఆనం విజయ కుమార్ రెడ్డిలు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి పోలీసు గ్రీవెన్స్ లో ఏఎస్పీ సౌజ‌న్య‌కి విన‌తి ప‌త్రం అంద‌చేశారు. పోలీసులను ఉపయోగించుకొని అధికార పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని..వెంట‌నే విచారించి వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు ఏఎస్పీని కోరారు. అనంత‌రం కాకాణి మీడియాతో మాట్లాడుతూ… కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ స్పస్టమైన ఆధారాలు లేకుండా అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. త‌మ‌ నాయకులను అక్రమ కేసులతో భయపెట్టాలని అధికార పార్టీ యోచిస్తుందని….అధికార పార్టీ పెడుతున్న కేసులకు భయపడి, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హెచ్చ‌రించారు. ఆనం మాట్లాడుతూ…రూరల్ లో రౌడీయిజం ఎక్కువైందని మండిప‌డ్డారు. మా సహనాన్ని చేతగాని తనంగా చూస్తున్నారని…. తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్ అని హెచ్చరించారు. కార్య‌క్ర‌మంలో రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *