ముఖ్య అతిధిగా పాల్గొన్న సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ VKC
మెట్టుకూరు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
- ముఖ్య అతిధిగా పాల్గొన్న సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ VKC
నెల్లూరు జిల్లా, అనంతసాగరంలోని గుంత బజారులో జామియా మసీదులో ముస్లింలకు మాజీ డిసిసిబి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక నమాజులు అనంతరం ఇఫ్తార్ విందు చేశారు. ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోమశిల ఉత్తర కాలువ ఛైర్మన్ మెట్టుకూరు కృష్ణ రెడ్డి, టీడీపీ నాయకులు కాసీం భాష, తదితరులు పాల్గొన్నారు.