ముత్యాల‌మ్మ జాత‌ర‌కు 105 ఆర్టీసీ బ‌స్సులు

ప్ర‌యాణికులు స‌ద్వినియోగం చేసుకోవాలి

వాకాడు ఆర్టీసీ బ‌స్టాండ్ డిపో మేనేజ‌ర్ ఎంసీ పెంచ‌ల‌య్య.

ముత్యాల‌మ్మ జాత‌ర‌కు 105 ఆర్టీసీ బ‌స్సులు…

  • ప్ర‌యాణికులు స‌ద్వినియోగం చేసుకోవాలి
  • వాకాడు ఆర్టీసీ బ‌స్టాండ్ డిపో మేనేజ‌ర్ ఎంసీ పెంచ‌ల‌య్య

ఈనెల 25వ‌తేదీ నుంచి 28వ‌తేదీ వ‌ర‌కు చిల్ల‌కూరు మండ‌లం తూర్పు క‌నుపూరు గ్రామంలో ముత్యాల‌మ్మ జాత‌ర జ‌రుగుతుంద‌ని…ఇందుకు ప్ర‌త్యేకంగా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా నుంచి 105 ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు వాకాడు ఆర్టీసీ డిపో మేనేజ‌ర్ ఎంసీ పెంచ‌ల‌య్య‌ తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. సామాన్యుల‌కు అందుబాటు ధ‌ర‌లో టికెట్ ల‌ను ఉంచిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఈ అవ‌కాశాన్ని ప్ర‌యాణికులంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. భ‌క్తుల‌కి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఆర్టీసీ సంస్థ‌ల అన్నీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *