లారీలకు తగిలిన కేబుల్ వైర్లు
నేలమట్టమైన విద్యుత్ స్తంభం
నెల్లూరు జిల్లాలో ఘటన
తప్పిన పెను ప్రమాదం…
- లారీలకు తగిలిన కేబుల్ వైర్లు
- నేలమట్టమైన విద్యుత్ స్తంభం
- నెల్లూరు జిల్లాలో ఘటన
చెన్నై నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ ఆయిల్ కంపెనీకి చెందిన యంత్రాలను తీసుకెళ్తున్న లారీలకు కేబుల్ వైర్లు తగలడంతో ఓ విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగి నేలమట్టం అయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మర్రిపాడు భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం సోమవారం జరిగింది. ప్రమాదం సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని…విద్యుత్ కు అంతరాయం లేకుండా మరమ్మతులు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.