సీఎంఆర్ఎఫ్ నిధులతో ఎంతో మందిని కాపాడుతున్న సీఎం చంద్రబాబు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఆపదలో ఉన్న వారికి అండగా CMRF…
- సీఎంఆర్ఎఫ్ నిధులతో సీఎం చంద్రబాబు ఎంతో మందిని కాపాడుతున్నారు
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులతో కష్టాలలో వున్న ప్రజలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలియచేసారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఆమె నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 18 మందికి CMRF చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన తొమ్మిది నెలలలో కోవూరు నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 7 విడతలలో 103 మందికి 1 కోటి 49 లక్షల 74 వేలు విలువ చేసే CMRF చెక్కులు అందచేశారన్నారు. 8 వ విడతగా 18 మందికి 19 లక్షల 95 వేలతో పాటు ఇప్పటి వరకు 8 విడతలలో మొత్తం 1 కోటి 69 లక్షల 70 వేలు CMRF చెక్కులు అందచేసారన్నారు. పేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరు పేట టిడిపి మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర నాయుడు, అడపాల అనీష్ రెడ్డి, చేనేత కార్పొరేషన్ డైరక్టర్ తాళస్వామి, టిడిపి నాయకులు కరకట్ట మల్లికార్జున, వంశీధర్ రెడ్డి, ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.