పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు మాదకద్రవ్వాల నివారణకు అవగాహన సైకిల్ యాత్ర
కావలిలో ఆతిధ్యం, జవహర్ భారతి కళాశాలలో అభినందన సభ.
కావలికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ ఫోర్స్ సైకిలిస్ట్ ల యాత్ర
- పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు మాదకద్రవ్వాల నివారణకు అవగాహన సైకిల్ యాత్ర
- కావలిలో ఆతిధ్యం, జవహర్ భారతి కళాశాలలో అభినందన సభ
సమాజ శ్రేయస్సు కోసం సైకిల్ యాత్ర చేస్తున్న సీఐఎస్ఎఫ్ ఫోర్స్ ను కావలిలో పలువురు వక్తలు అభినందించారు. తీర ప్రాంతంలో మాదకద్రవ్వాల నివారణకు పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు సీఎస్ఎఫ్ ఫోర్స్ అవగాహన సైకిల్ యాత్ర చేపట్టారు. వీరు శనివారం రాత్రి కావలికి రాగా వారికి ఆతిధ్యం ఇచ్చారు. ఆదివారం ఉదయం జవహర్ భారతి కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేయగా జేబీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం నాయుడు, కావలి డిఎస్పీ శ్రీధర్, సీఐలు ఫిరోజ్ ఖాన్, గిరిబాబులు అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండ్ సభ్యులు సాజిత్ యాత్ర ఉద్దేశ్యాన్ని వివరించారు. వచ్చిన ముఖ్య అతిధులును సత్కరించారు. అనంతరం సిఐఎస్ఎఫ్ కమాండ్ సభ్యులు , డి.ఎస్.పి శ్రీధర్. లు జెండా ఊపి సైకిలిస్టుల యాత్రను ప్రారంభించారు.