మ‌సీదుల‌కు 60 వాట‌ర్ కూల‌ర్స్ అంద‌చేత‌

వీపీఆర్ ఫౌండేష‌న్ దాతృత్వం…

ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేమిరెడ్డి

మ‌సీదుల‌కు 60 వాట‌ర్ కూల‌ర్స్ అంద‌చేత‌…

  • వీపీఆర్ ఫౌండేష‌న్ దాతృత్వం…
  • ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేమిరెడ్డి

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కోవూరు నియోజకవర్గ పరిధిలోని మసీదులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి 60 వాటర్ కూలర్లు అందచేశారు. ఈ సందర్భముగా ఆమె నియోజకవర్గ ముస్లిం ప్రజానీకానికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఉపవాస దీక్ష వున్న వారికి చల్లటి నీరు అందివ్వాలన్న లక్ష్యంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో మసీదులకు వాటర్ కూలర్లు అందిస్తున్నట్టు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా భక్తి శ్రద్ధలతో వుండాలని ఆమె కోరారు. ఈర్షా ద్వేషాలకు దూరంగా శాంతి, సహనం అలవర్చుకోవాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరు పరోపకారం, పరమత సహనం పాటించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ ఛైర్మన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్ యరటపల్లి శివకుమార్ రెడ్డి,పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, మైనారిటి నాయకులు ఇంతియాజ్, జమీర్, జహంగీర్, ఫిరోజ్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *