ఘనంగా ఏపీ టిడ్కో చైర్మన్ జన్మదిన వేడుకలు

కావలి పట్టణంలో జనసేన యువనాయకుడు సిద్దు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

ఎస్టీ కాలనీల్లో 300 కుటుంబాలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ

ఘనంగా ఏపీ టిడ్కో చైర్మన్ జన్మదిన వేడుకలు

  • కావలి పట్టణంలో జనసేన యువనాయకుడు సిద్దు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
  • ఎస్టీ కాలనీల్లో 300 కుటుంబాలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ

కావలి పట్టణంలో పేదల మధ్యలో జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి, క్రమశిక్షణ సంఘం చైర్మన్, l నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలను జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కావలి నియోజకవర్గ జనసేన యువ నాయకుడు సిద్దు ఆధ్వర్యంలో ముసునూరు, బుడంగుంట ఇందిరమ్మ, , కరెంట్ ఆఫీసు వద్ద 300 ఎస్టీ కుటుబాలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజా రాజకీయ జీవితంలో మరెన్నో పదవులు అలంకరించి సేవ చేయాలని కోరుకుంటున్నట్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా పర్యవేక్షులుగా నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీని ఎంతో బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ఆయన అడుగుజాడల్లో తాము కావలిలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమలో కావలి రూరల్ మండల అధ్యక్షులు తుళ్లూరు తిరుపతి స్వామి,చేవూరు నాయబ్,సాయి,మల్లికార్జున యాదవ్,మెడికల్ సురేష్,మహ్మద్,హరీష్,విష్ణు, జనసేన నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *