ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఎంపీడీవో
సంగంలో స్పెషల్ ఆధార్ క్యాంప్…
- ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – ఎంపీడీవో
నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ స్పెషల్ క్యాంపును ఎంపీడీఓ షాలెట్ పరిశీలించారు. ఆధార్ పని తీరు గురించి ఆపరేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 19 నుండి 22 వరకు, 25 నుండి 28 వ తేదీ వరకు క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. మండల ప్రజలు ఆధార్ స్పెషల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.