సీపీఎం నాయకులు హెచ్చరిక
54వ డివిజన్లో ప్రజలతో కలిసి నిరసన ర్యాలీ
సచివాలయం వద్ద ధర్నా
వేధింపుల్ని ఆపకపోతే కార్పొరేషన్ని ముట్టడిస్తాం
- సీపీఎం నాయకులు హెచ్చరిక
- 54వ డివిజన్లో ప్రజలతో కలిసి నిరసన ర్యాలీ
- సచివాలయం వద్ద ధర్నా
నిరుపేదలపై ఇంటి, కొళాయి పన్నుల బలవంతపు వసూళ్లను నిరసిస్తూ…సీపీఎం నాయకులు ప్రజలతో కలిసి ఆందోళనకు దిగారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో…. నెల్లూరు సిటీ నియోజకవర్గం 54 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ మూడు జెండాల సెంటర్ నుండి నిరసన ర్యాలీ నిర్వహించి…అనంతరం సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు జీ నాగేశ్వరరావు, కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. నగరంలో ఇంటి పన్నులు – కొళాయి పన్నుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఖజానా నింపుకోవడం కోసం దౌర్జన్యాలు చేయడం తగదని…వెంటనే బలవంతపు వసూలను తక్షణమే ఆపాలని డడిమాండ్ చేశారు. ప్రజలపై వేధింపులు ఆపకపోతే నగర ప్రజలను సమీకరించి త్వరలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.