నాయుడుపేటలో మున్సిపాలిటీ నిధులు స్వాహా
బిల్లుకలెక్టర్.. భలే మోసం చేశాడు
-నాయుడుపేటలో మున్సిపాలిటీ నిధులు స్వాహా
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ నిధులు బిల్ కలెక్టర్ రమేష్ లక్షల రూపాయలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కాంప్లెక్స్ దుకాణాల బకాయిలు వసూలు చేసి.. మున్సిపల్ ఖజానాకి చేయకుండా.. ఆ బిల్ కలెక్టర్ తన ఖాతాలో జమ చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దుకాణదారులు కమిషనర్ ఫజుల్లులాకి ఫిర్యాదు చేశారు. నకిలీ బిల్లులతో అతడు మోసం చేసినట్లు గుర్తించి.. తాము మోసపోయామంటూ.. కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో.. అతడి మోసం వెలుగులోకి వచ్చింది. అతడిపై చర్యలు తీసుకుని.. స్వాహా చేసిన నిధులను రికవరీ చేసేందుకు అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.