580 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పెద్దపవని నుంచి చెన్నైకు రేషన్ బియ్యం తరలింపు

జేసీ ఆదేశాలతో దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద పట్టుకున్న రెవెన్యూ అధికారులు

లారీని దగదర్తి పోలీసులకు అప్పగింత

580 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

-కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పెద్దపవని
నుంచి చెన్నైకు రేషన్ బియ్యం తరలింపు.
-జేసీ ఆదేశాలతో దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద
పట్టుకున్న రెవెన్యూ అధికారులు
-లారీని దగదర్తి పోలీసులకు అప్పగింత

ఎన్ని విమర్శలు వచ్చినా.. కందుకూరు నియోజకవర్గం నుంచి అక్రమ రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. బుదవారం రాత్రి దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద రేషన్ బియ్యంతో అక్రమ రవాణా చేస్తున్న లారీని
రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ను ఆరా తీయగా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పెద్దపవని నుంచి చెన్నైకు ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు ఒప్పేసుకున్నాడు. పట్టుబడిన లారీని, డ్రైవర్ ను దగదర్తి పోలీసులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా దగదర్తి తహశీల్దారు కృష్ణ మాట్లాడుతూ.. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో ఈ లారీని బుదవారం రాత్రి 11 గంటల సమయంలో పట్టుకోవడం జరిగిందన్నారు. లారీలో 580 బస్తాలు ఉన్నాయని, సుమారు 26 టన్నులు ఉంటాయన్నారు. వీటి విలువ సుమారు 13 లక్షల రూపాయలు ఉండవచ్చని చెప్పారు. తదుపరి విచారణ చేస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *