సోమశిల ఆయకట్టును స్థిరీకరించాలి

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

ల్యాండ్ కన్వర్షన్ జరిగిన భూములను ఆయకట్టు పరిధి నుంచి తొలగించాలి

సాగునీటి కేటాయింపులో నిజమైన సాగు రైతులకు నీరందని పరిస్థితి

మంత్రి నారాయణ ఆసుపత్రి సముదాయం ఉన్న 100 ఎకరాలు ఇంకా ఆయకట్టు పరిధిలోనే..

శాసన సభలో కావ్య కృష్ణారెడ్డి గళం

సోమశిల ఆయకట్టును స్థిరీకరించాలి

  • ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
  • ల్యాండ్ కన్వర్షన్ జరిగిన భూములను ఆయకట్టు పరిధి
    నుంచి తొలగించాలి
  • సాగునీటి కేటాయింపులో నిజమైన సాగు రైతులకు నీరందని పరిస్థితి
  • మంత్రి నారాయణ ఆసుపత్రి సముదాయం ఉన్న 100 ఎకరాలు ఇంకా ఆయకట్టు పరిధిలోనే..
  • శాసన సభలో కావ్య కృష్ణారెడ్డి గళం

జలాశయాలు, పలు మేజర్, మైనర్ నీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణ జరగాలని
శాసనసభలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పట్టుబట్టారు. గురువారం శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుమతితో ఎమ్మెల్యే మాట్లాడారు. 1989లో ఏర్పడిన సోమశిల జలాశయం అప్పుడు నమోదు చేసిన ఆయకట్టుకే నేటికీ నీటి కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. కానీ వేల ఎకరాలు వివిధ అవసరాల కోసం ప్రభుత్వం భూసేకరణ చేసిందన్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు వ్యవసాయ భూములు తీసుకొవడం జరిగిందన్నారు. కానీ ఈ భూములు వ్యవసాయ ఆయకట్టుకిందనే లెక్కలు వేసి నీటి కేటాయింపులు చేస్తున్నట్లు తెలిపారు. ఉదాహరణకు నెల్లూరులో మంత్రి నారాయణ ఆసుపత్రి సముదాయం సుమారు 100 ఎకరాల్లో ఉందన్నారు. ఈ భూమికూడా ఆయకట్టు పరిధిలోనే ఉందన్నారు. దీనివల్ల సరైన నీటికేటాయింపులు లేక నిజంగా సాగుచేసే రైతులు నష్టపోతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ మంత్రి ల్యాండ్ కన్వర్షన్ జరిగిన భూములను ఆయకట్టు పరిధి
నుంచి తొలగించి ఆయకట్టును స్థిరీకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *