రంగ‌డి తెప్పోత్స‌వం ట్రైల్‌

ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన నుడా చైర్మ‌న్‌, ఆల‌య చైర్మ‌న్‌, ఈవో టౌన్ డీఎస్పీ

రంగ‌డి తెప్పోత్స‌వం ట్రైల్‌…

  • ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన నుడా చైర్మ‌న్‌, ఆల‌య చైర్మ‌న్‌, ఈవో టౌన్ డీఎస్పీ

నెల్లూరు రంగ‌నాయ‌కుల‌పేట‌లోని శ్రీ త‌ల్ప‌గిరి రంగ‌నాథ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అత్యంత వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా మార్చి 20వ‌తేదీ గురువారం రాత్రి తెపోత్స‌వాన్ని క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో తెప్పోత్స‌వానికి ముందుగా ట్రైల్ వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నుడా చైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, ఆల‌య‌, ఈవో, టౌన్ డీఎస్పీ సింధు ప్రియ‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రూ తెప్పోత్స‌వంపై ట్రైల్ వేశారు. రేపు జ‌ర‌గబోయే తెప్పోత్స‌వానికి కావాల్సిన ఏర్పాట్లు, భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను చ‌ర్చించుకున్నారు. అనంత‌రం నుడా చైర్మ‌న్ శ్రీ‌నివాసులురెడ్డి మాట్లాడుతూ… వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే తెప్పోత్స‌వానికి సొంత తెప్ప ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఆల‌య చైర్మ‌న్‌, ఈవోలు మాట్లాడుతూ….ప్ర‌తీ ఏడాది రంగ‌నాథ‌స్వామి వారి తెప్పోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. భ‌క్తులు విశేషంగా పాల్గొని తెప్పోత్స‌వాన్ని విజ‌య‌వంతం చేసి స్వామి, అమ్మ‌వార్ల కృప‌కు పాత్రులు కావాల‌ని ఆకాంక్షించారు. టౌన్ డీఎస్పీ సింధుప్రియ మాట్లాడుతూ… రంగ‌నాథ‌స్వామి ఆశీస్సుల‌తో తెప్పోత్స‌వం విజ‌యంతం కావాల‌న్నారు. రేపు జ‌ర‌గ‌బోయే తెప్పోత్స‌వంలో ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా గ‌ట్టి పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య అధికారులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *