– ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పెద్ద సంఖ్యలో ఇసుక తరలింపు
చీపురుగూడెంలో పట్టుబడ్డ లారీ
ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పేర్లు చెబుతున్న దుండగులు.
దమ్మపేటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా…
- ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పెద్ద సంఖ్యలో ఇసుక తరలింపు
- చీపురుగూడెంలో పట్టుబడ్డ లారీ
- ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పేర్లు చెబుతున్న దుండగులు
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్రతీ రోజు రాత్రి పగలు అన్న తేడా లేకుండా పదుల సంఖ్యలో లారీల నుంచి అక్రమంగా ఇసుక తరలించేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణాకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అర్ధరాత్రి చీపురగూడెంలో పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఎక్కడి నుంచి తరలిస్తున్నారు… అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించగా…ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పేర్లను దుండగులు చెబుతుండడం గమనార్హం. అర్ధరాత్రి ఇసుకను కొందరు బడాబాబులు అక్రమంగా రవాణా చేస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీలను సీజ్ చేయడంతో పాటు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.