
తగ్గిపోతున్న పిచ్చుకల మనుగడ
ఎఫ్బీవో దొరసానమ్మ కోటపోలూరులో ఘనంగా పిచ్చుకల దినోత్సవం. తగ్గిపోతున్న పిచ్చుకల మనుగడ… తిరుపతి జిల్లా కోటపోలూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో DFO హారిక ఆదేశాల మేరకు… అటవీ శాఖ అధికారులు పిచ్చుకల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. FBO దొరసానమ్మ మాట్లాడుతూ.. పిచ్చుకల మనుగడ క్రమేపి తగ్గిపోతుందని, వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ చంద్రజిత్ యాదవ్, ఉపాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు.