శ్రీ చైతన్య స్కూల్ కు తాళం

స్కూల్ బిల్డింగ్‌కు బ‌కాయిలు చెల్లించ‌ని యాజ‌మాన్యం

తాళాలు వేసిన య‌జ‌మాని

ప‌త్తా లేని స్కూల్ క‌ర‌స్పాండెంట్‌, ప్రిన్సిప‌ల్‌

ఆందోళన చెందుతున్న విద్యార్థులు, త‌ల్లిదండ్రులు.

శ్రీ చైతన్య స్కూల్ కు తాళం..
-స్కూల్ బిల్డింగ్‌కు బ‌కాయిలు చెల్లించ‌ని యాజ‌మాన్యం
-తాళాలు వేసిన య‌జ‌మాని
-ప‌త్తా లేని స్కూల్ క‌ర‌స్పాండెంట్‌, ప్రిన్సిప‌ల్‌

-ఆందోళన చెందుతున్న విద్యార్థులు, త‌ల్లిదండ్రులు

నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోని రామ‌మందిరం రోడ్డులో ఉన్న శ్రీ చైత‌న్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు తాళం వేశారు. ఆ స్కూల్‌లో మొత్తం 500 మంది విద్యార్థులు చ‌దువుతున్నారు. అయితే గ‌త కొద్ది రోజులుగా ఆ స్కూల్ కు తాళాలు వేశారు. ముందుగా ఏదైనా స‌మ‌స్య అనుకున్నారంతా.. ఎంత‌కీ తాళాలు తీయ‌క‌పోవ‌డంతో.. విద్యార్థుల త‌ల్లిదండ్రులు విచారించారు. ఆ స్కూల్ బిల్డింగ్ య‌జ‌మాని వేమారెడ్డి వినీత్‌రెడ్డికి.. ఆ స్కూల్ న‌డుపుతున్న క‌ర‌స్పాండెంట్ రెండేళ్లుగా బిల్డింగ్ రెంట్ క‌ట్ట‌క‌పోవ‌డంతో య‌జ‌మాని ఆ స్కూల్‌కు తాళాలు వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కొద్ది రోజులుగా స్కూల్ జ‌ర‌క్క పోవ‌డంతో చ‌దువుకు ఆటంకం క‌లుగుతుంద‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. మంగ‌ళ‌వారం ఈ విష‌యం కోవూరు అంతా చ‌ర్చ‌నీయాంశంగా మార‌డంతో కోవూరు పోలీసులు వ‌చ్చి ప‌రిశీలించారు. ఆ స్కూల్ క‌రస్పాండెంట్‌గాని.. ప్రిన్సిప‌ల్‌గాని అందుబాటులోకి రాలేదు. ఈవిష‌యంలో విద్యాశాఖాధికారులైనా జోక్యం చేసుకుని.. పిల్ల‌ల చ‌దువుకు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *