రూ.7.50 కోట్ల విలువైన భూములకు సంకెళ్లు

మా భూములు పంచండి మహాప్రభో… అంటూ 8 ఏళ్లుగా దళితుల ప్రదక్షిణలు

చలనం లేని రెవెన్యూ, ఎస్సీకార్పొరేషన్ అధికారులు..!

విడవలూరు మండలం ఊటుకూరులో భూమి కొనుగోలు పథకం భూముల కథ ఇది.

మండి పడుతున్న దళిత సంఘాల నాయకులు

ల‌బ్ధిదారుల‌కు చెంద‌కుండా చ‌క్రం తిప్పుతున్న ఓ నాయ‌కుడు.

రూ.7.50 కోట్ల విలువైన భూములకు సంకెళ్లు..!

-మా భూములు పంచండి మహాప్రభో… అంటూ 8 ఏళ్లుగా దళితుల ప్రదక్షిణలు
-చలనం లేని రెవెన్యూ, ఎస్సీకార్పొరేషన్ అధికారులు..!
-విడవలూరు మండలం ఊటుకూరులో భూమి కొనుగోలు పథకం భూముల కథ ఇది.
-మండి పడుతున్న దళిత సంఘాల నాయకులు

-ల‌బ్ధిదారుల‌కు చెంద‌కుండా చ‌క్రం ఇప్పుతున్న ఓ నాయ‌కుడు

ఒకటి కాదు రెండు కాదు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో కొన్న భూములు అవి.
భూములు అమ్మిన రైతులకు అక్షరాల చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ ఆ భూములు మాత్రం ఇంకా అమ్మినవారి కబందాస్తాల్లోనే ఉన్నాయి. మా భూములు మాకు సర్వే చేయించి పంచాలని ఎనిమిదేళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ లబ్ధి దారులు తిరుగుతున్నా.. అధికారుల్లో చలనమే లేదు. ఒకపక్క డబ్బులు తిని, మరోపక్క ఆ భూమల్లోనే దర్జాగా పండించుకుంటున్నా.. ఏ అధికారి అటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి ఓ నాయకుడు ఆ భూములను లబ్దిదారులకు అందకుండా అధికారులను మభ్యపెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లి లబ్ధిదరాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసలు అధికారులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారా.. అని ప్రశ్నించారు. విడవలూరు మండలం ఊటుకూరు గ్రామ దళితులకు 2018 భూమి కొనుగోలు పథకం కింద ప్రభుత్వం 91 మంది దళితులకు 91 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం 7 కోట్ల, 50 లక్షలు చెల్లించిందన్నారు. ఇప్పటివరకు ఆ భూములు ఎక్కడ ఉన్నాయో, రెవెన్యూ అధికారులు తెలపలేదన్నారు. వారి చుట్టూ ఇంకెన్ని సంవత్సరాలు తిరగాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *