విద్యార్థినులకి సూచించిన సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్
సంగం జడ్పీ హైస్కూల్లో స్వీయ రక్షణపై అవగాహన
మార్షల్ ఆర్ట్స్, కరాటేపై పట్టు సాధించాలి
- విద్యార్థినులకి సూచించిన సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్
- సంగం జడ్పీ హైస్కూల్లో స్వీయ రక్షణపై అవగాహన
నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక జెడ్పీ హై స్కూల్,గురుకుల పాఠశాలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్ విద్యార్థినులకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు.ముందుగా రూపేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆద్వర్యం లో కరాటే మాస్టర్ నరేష్ విద్యార్థినులకు కరాటే,మార్షల్ ఆర్ట్స్ పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థినులు తమకు తాము రక్షణ కల్పించుకునేలా తయారవ్వాలని సూచించారు. శారీరకంగా బాగుంటేనే మానసికంగా, మేధోపరంగా బాగుంటారని చెప్పారు. ఆపద వేళల్లో ఎవరి మీద ఆధారపడకుండా విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్,కరాటే వాటిపై పట్టు సాధించాలని తెలిపారు. ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని.. అత్యవసర సమయాల్లో పోలీస్ మీ వెంటే ఉంటారని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.