కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి పరాకాష్ట
పనుల్లో నాణ్యత లోపం…
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి పరాకాష్ట
కావలి -సీతారాంపురం 167 జిబి హైవే పనుల్లో నాణ్యత లోపం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ప్రస్తుతం పనులను నిర్వహిస్తున్న హైవే కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి పరాకాష్టగా మిగులుతుంది. వింజమూరు పరిధిలోని చెరువు కట్ట సమీపంలో వంతెన నిర్మించారు. రోడ్డుకి ఇరువైపులా రిబిట్ల నిర్మాణంలో నాణ్యత లోపించడంతో మట్టి కోతకు గురై సిమెంట్ పగళ్ళు కనిపించడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైవే పనులు పూర్తి కాకముందే ఇలాంటి నాణ్యత లోపం కనిపించడంతో…నాణ్యత లోపం ఉన్నట్లుల స్పష్టంగా అర్ధమవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.