ధాన్యం కొనుగోలు విషయంలో దళారులను హెచ్చరించిన పట్టాభి రామిరెడ్డి

తాటిప‌ర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప‌రిశీలించిన వేమిరెడ్డి

పుట్టికి రూ.19720 గిట్టుబాటు ధ‌ర క‌ల్పించిన ప్ర‌భుత్వం

ధాన్యం కొనుగోలు విషయంలో దళారులను హెచ్చరించిన
పట్టాభి రామిరెడ్డి
-తాటిప‌ర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప‌రిశీలించిన వేమిరెడ్డి

పుట్టికి రూ.19720 గిట్టుబాటు ధ‌ర క‌ల్పించిన ప్ర‌భుత్వం

నెల్లూరు జిల్లా.. పొదలకూరు మండలం.. తాటిపర్తి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమీరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆక‌స్మిక త‌నిఖీ చేప‌ట్టారు. ఈసంద‌ర్భంగా ప‌ట్టాభి.. రైతులకి షెడ్యూలింగ్ గురించి క్లుప్తంగా వివరించారు. రైతుల సౌకర్యార్థం ప్రతి రైస్ మిల్లు కట్టిన బ్యాంకు గ్యారంటీ కి ఒకటిన్నర రెట్లు అధికంగా ధాన్యం తీసుకునేలా.. ప్రభుత్వం విసులుబాటు కల్పించింద‌ని వివ‌రించారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ గ్రేడ్- ఏ రకం పుట్టి 19720 రూపాయిల ధ‌ర‌ నిర్ణయించబడినదని.. కొనుగోలు చేసిన 24 గంటల్లోఅకౌంట్లోకి డబ్బు జమవుతుందని తెలిపారు. అలాగే రైతులు రైతు సేవ కేంద్రానికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే ప్రభుత్వ వాట్సాప్ నంబర్ 7337359375 కి.. మీ వాట్సాప్ నెంబర్ నుండి హాయ్ అని మెసేజ్ పెడితే మీ ధాన్యానికి షెడ్యూలింగ్ మెసేజ్ వస్తుంద‌ని తెలిపారు. తద్వారా మీరు ధాన్యం అమ్మకానికి సిద్ధమైనట్లు పిపిసికి అందుతుందని తెలియజేశారు. దాళారులు రైతుల వద్ద మద్దత్తు దరకంటే తక్కువ కొనుగోలు చేయకూడదని.. అలాచేసిన‌ట్లు త‌మ దృష్టికి వ‌స్తే.. త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని.. ఈసంద‌ర్భంగా ప‌ట్టాభి హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ లక్ష్మీనారాయణ గారు, CEO, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *