మద్దత్తు ధర ఏ ప్రభుత్వం లో ఎంత ఉందో తెలుసుకోవాలి
బస్తా యూరియా 400 కి ఎవరు కొన్నారో నిరూపించాలి
దళారులు అందరూ వైఎస్సార్సీపీ లొనే ఉన్నారు
విలేకరుల సమావేశంలో కాకాణి కి టీడీపీ నాయకుల కౌంటర్
ఎక్కువ రేటు సరే…
తక్కువ రేటు కూడా అప్పుడే..!!
-మద్దత్తు ధర ఏ ప్రభుత్వం లో ఎంత ఉందో తెలుసుకోవాలి.
-బస్తా యూరియా 400 కి ఎవరు కొన్నారో నిరూపించాలి.
-దళారులు అందరూ వైఎస్సార్సీపీ లొనే ఉన్నారు.
-విలేకరుల సమావేశంలో కాకాణి కి టీడీపీ నాయకుల కౌంటర్.
గత ప్రభుత్వం లో వరి ధాన్యం ఎక్కువ రేటు గురించి మాజీమంత్రి కాకాణి మాట్లాడారు సరే…మరి అదే ప్రభుత్వం లో తక్కువ రేటు గురించి కూడా గుర్తుచేసుకోవాలని టీడీపీ నాయకులు హితవు పలికారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయపాలెం లో టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మంగళవారం డమ్మాయపాలెం లో కాకాణి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల బిసి సెల్ అధ్యక్షుడు పల్లికొండ శీనయ్య మాట్లాడుతూ… వైఎస్సార్సీపీ నాయకుల కళ్లాల దగ్గరకు వచ్చిన కాకాణి…సోమిరెడ్డి పై విమర్శలు చేయడం సరికాదన్నారు. యూరియా నాలుగు వందల రూపాయలకు కొన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. సాగు నీటి సంఘం ఉపాధ్యక్షుడు పడాల నర్సారెడ్డి మాట్లాడుతూ… దళారులు మొత్తం వైఎస్సార్సీపీ వాళ్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఆకుల ఈశ్వర్ రెడ్డి…టీడీపీ నాయకులు వేల్పుల నాగార్జున యాదవ్
ఇంగిలాల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.