ఉదయగిరి ఉపాధిలో రూ.37.80 లక్షల అవినీతి

ఉదయగిరిలోమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక

రూ.93 లక్షల పనులకు రికార్డులే చూపించని వైనం

ఏపీవో, ఇద్దరుఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లుపై వేటు

ఇద్దరూ సీవోలు, 7 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెన్షన్

ఉదయగిరి ఉపాధిలో రూ.37.80 లక్షల అవినీతి

  • ఉదయగిరిలోమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక
  • రూ.93 లక్షల పనులకు రికార్డులే చూపించని వైనం
  • ఏపీవో, ఇద్దరుఈసీ, ముగ్గురు
    టెక్నికల్ అసిస్టెంట్లు పై వేటు
  • ఇద్దరూ సీవోలు, 7 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెన్షన్

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి బయటపడింది. గత ఆర్థిక సంవత్సరం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజావేదిక జరగగా పిడి గంగాభవాని హాజరయ్యారు. పంచాయతీల వారీగా సామాజిక తనిఖీల్లో వెలుగుచూసిన అవినీతిని డిఆర్పీలు ఆధారాలతో సహా బయటపెట్టారు. దాదాపు 37 లక్షల 80 వేల రూపాయల అవినీతిరినట్టు తేలిందని పిడి గంగాభవాని తెలిపారు. రికవరీకి ఆదేశించినట్లు ఆమె చెప్పారు. అదేవిధంగా సుమారు 93 లక్షల విలువ గల పనులకు రికార్డులు చూపించకపోయినట్లు చెప్పారు. ఏపీవో, ఇద్దరుఈసీ, ముగ్గురు
టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరూ సీవోలు, 7 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెన్షన్ పై వేటు వేసినట్లు పీడీ తెలిపారు. వారిపై పోలీస్ చర్యకు ఉన్నతాధికారులను కోరుతామని ఆమె చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *