ఎమ్మెల్సీగా డిక్లరేషన్ అందుకున్న బీద
బీద రవిచంద్రకు ధృవీకరణ పత్రం అందచేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వనితారాణి
బీద గెలుపు ఏకగ్రీవం…
- ఎమ్మెల్సీగా డిక్లరేషన్ అందుకున్న బీద
- బీద రవిచంద్రకు ధృవీకరణ పత్రం అందచేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వనితారాణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యులుగా…టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గెలుపు ఏకగ్రీవమైనట్లు శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వనితారాణి ధృవీకరించారు. సోమవారం అసెంబ్లీలో…బీద రవిచంద్రకు డిక్లరేషన్ ఫాంను ఆమె అందచేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ప్రభుత్వ నాయకత్వానికి బీద కృతజ్ఞతలు తెలియజేశారు. బీదతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ , ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు , ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ ఉన్నారు.