నామినేటెడ్ ప‌ద‌వులపై ఏకాభిప్రాయం

క‌ష్ట‌ప‌డ్డారికే ప‌ద‌వులు

ధాన్యం కొనుగోలు, రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు

జిల్లా పార్టీ నూత‌న కార్యాల‌యం కోసం స్థ‌ల సేక‌ర‌ణ చేసి తీరాలి

అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సోమిరెడ్డి నివాసంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం

కీల‌క అంశాలపై ఏకాభిప్రాయం

నామినేటెడ్ ప‌ద‌వులపై ఏకాభిప్రాయం
క‌ష్ట‌ప‌డ్డారికే ప‌ద‌వులు..!

-ధాన్యం కొనుగోలు, రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు
-జిల్లా పార్టీ నూత‌న కార్యాల‌యం కోసం స్థ‌ల సేక‌ర‌ణ చేసి తీరాలి
–అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సోమిరెడ్డి నివాసంలో..
జిల్లా సమన్వయ కమిటీ సమావేశం.

-కీల‌క అంశాలపై ఏకాభిప్రాయం

విజయవాడలోనీ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసంలో సోమ‌వారం సాయంత్రం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ధాన్యం కొనుగోలు – రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, జిల్లా పార్టీ నూతన కార్యాలయం కొరకు స్థల సేకరణ నిర్మాణం, జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పిఎసిసి త్రిసభ్య, ఏఎంసీ, దేవాలయాల కమిటీల నియామకం, ఏజీపీ నియామకం, నామినేటెడ్ ప‌ద‌వులు, ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయవలసిన ఇఫ్తార్ విందు, అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలు అజెండాగా సమావేశం సాగింది. ముఖ్యంగా.. జిల్లా పార్టీ కార్యాల‌యం, నామినేటెడ్ ప‌ద‌వులు, కేటాయింపులు, ఇత‌ర అంశాల‌పై ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా క‌ష్ట‌ప‌డేవారికే ప‌ద‌వులు ఇవ్వాల‌న్న చ‌ర్చ‌కూడా జ‌రిగింది. అందుకు ప్ర‌జాప్ర‌తినిధులంతా ఏకాభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అలాగే.. ధాన్యం కొనుగోలు, రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కూ ప‌రిష్కారం చూపాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. నెల్లూరు న‌గ‌రంలో జిల్లా పార్టీ నూతన కార్యాల‌యంకు స్థ‌ల సేక‌ర‌ణను వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని కూడా చ‌ర్చించారు. ఏది ఏమైనా ఈ స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణయాల‌ను ప‌రిష్క‌రించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ముఖ్య‌నేత‌లు ఏకాభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు నస్యం మొహమ్మద్ ఫరూక్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, శాసనసభ్యులు పాసీం సునీల్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, కావ్య కృష్ణ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీటీడీ బోర్డ్ సభ్యురాలు పనబాక లక్ష్మి, నెల్లూరు పార్లమెంటు టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *