ధ‌న్య‌వాదాలు ప్ర‌శాంత‌మ్మ‌

ఎమ్మెల్యే చొరవతో నీటి సమస్యకు పరిష్కారం

హ‌ర్షం వ్య‌క్తం చేసిన వ‌డ్డిపాళెం గ్రామ‌స్థులు

ధ‌న్య‌వాదాలు ప్ర‌శాంత‌మ్మ‌…

  • ఎమ్మెల్యే చొరవతో నీటి సమస్యకు పరిష్కారం
  • హ‌ర్షం వ్య‌క్తం చేసిన వ‌డ్డిపాళెం గ్రామ‌స్థులు

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో ప్రజల నీటి సమస్యకు పరిష్కారం దొరికింది. కొడవలూరు మండలంలోని పాతవంగల్లు పంచాయతీ వడ్డిపాలెం గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పైపులు, తాగునీటి పైపులు ఒకే ప్రాంతం నుంచి వెళ్లడంతో తాగునీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. దాంతో డ్రైనేజీ నీరు తాగు నీటితో కలవడం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. సత్వరమే స్పందించి గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. దాంతో స్పందించిన అధికారులు సోమవారం డ్రైనేజీ వెళ్లేందుకు ప్రత్యేక పైపులు ఏర్పాటు చేశారు. తాగునీటి పైపులకు మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. దాంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యపై వెంటనే స్పందించి పరిష్కరించిన ఎంఎల్ఏ ప్రశాంతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *