నిబంధనలకు లోబడే నిర్మాణాలు చేపట్టాలి
టౌన్ ప్లానింగ్ సమీక్షలో మేయర్ స్రవంతి జయవర్ధన్.
కూల్చివేతలతో వారికి తీవ్రమైన ఆస్తి నష్టం
- నిబంధనలకు లోబడే నిర్మాణాలు చేపట్టాలి…
- టౌన్ ప్లానింగ్ సమీక్షలో మేయర్ స్రవంతి జయవర్ధన్
నగర పాలక సంస్థ పరిధిలో జరిగే నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రారంభ దశలోనే భవన యజమానులకు తెలియజేయాలని, నిర్మాణం పూర్తయిన అనంతరం కూల్చివేతలతో వారికీ తీవ్రమైన ఆస్తి నష్టం చేకూరుతుందని మేయర్ స్రవంతి జయవర్ధన్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు. నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రాణాధికా విభాగం అధికారులతో సమీక్ష సమావేశాన్ని మేయర్ చాంబర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డి.టి.సి.పి నిర్దేశించిన నూతన మార్గదర్శకాలపై సచివాలయాల పరిధిలో భవన నిర్మాణ యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్పొరేషన్ నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందిన భవన యజమానులు నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టేలా అధికారులు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో డి.సి.పి పద్మజ, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వేణు, ప్రకాష్, టి.పి.ఓ లు, టి.పి.బి.ఓ లు, నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.