వైభవంగా కొనసాగుతున్న రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు
అశ్వవాహనంపై ఊరేగిన రంగనాథుడు
-వైభవంగా కొనసాగుతున్న రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నాం తిరుప్పాయ్నాడల్ సేవ, రాత్రి.. అశ్వవాహనంపై రంగనాథుడు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వారంతా స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అశ్వవాహనంపై ఊరేగిన రంగడుని చూస్తూ భక్తి పారవశ్యంతో పరవశించిపోయారు. ఈ
ఉత్సవాలను ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి, కార్యనిర్వహణాధికారి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.