పక్కా ప్లాన్తోనే చింటుని కత్తులతో దాడి చేసి హత్య
హత్య కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన వేదాయపాళెం పోలీసులు
మారణాయుధాలు స్వాధీనం
మీడియా సమావేశంలో టౌన్ డీఎస్పీ సింధుప్రియ వెల్లడి.
అమ్మాయి విషయం మాట్లాడుదాం అని పిలిపించి…
- పక్కా ప్లాన్తోనే చింటుని కత్తులతో దాడి చేసి హత్య
- హత్య కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన వేదాయపాళెం పోలీసులు
- మారణాయుధాలు స్వాధీనం
- మీడియా సమావేశంలో టౌన్ డీఎస్పీ సింధుప్రియ వెల్లడి
నెల్లూరురూరల్ పొదలకూరు రోడ్డు జడ్పీ హైస్కూల్ ఎదురుగా చింటూని కొందరు గుర్తు తెలియని అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితుల్ని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి హత్య చేసేందుకు ఉపయోగించిన మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు… నెల్లూరు నగరంలోని టౌన్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సింధుప్రియ…నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి….కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పొదలకూరు రోడ్డుకి చెందిన శివకుమార్ కృష్ణ సాయి అలియాస్ కిట్టు, షేక్ మహ్మద్, కొత్తూరుకి చెందిన సయ్యద్ కరిముల్లా, వెంగళరావునగర్కి చెందిన గొలగముడి పవన్, ఫ్రాన్సిస్ అనిక్ రాజ్, మనుబోలుకి చెందిన కోసురు సాయితేజ లు పక్కా ప్లాన్తోనే చింటూని నిందితులు హత్య చేశారన్నారు. ఈ సమావేశంలో వేదాయపాళెం పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.