జిల్లా ఎస్పీ కృష్ణకాంత్
ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్పీ
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
- జిల్లా ఎస్పీ కృష్ణకాంత్
- ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్పీ
నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో…. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ కృష్ణకాంత్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు బాధితులు గ్రీవెన్స్ కి విచ్చేశారు. వారి వద్ద నుంచి ఎస్పీ వినతులు స్వీకరించి…వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేదికకు వచ్చే ప్రతీ అర్జీని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ బాధితులకి హామీ ఇచ్చారు. వేదికకు మొత్తం 75 ఫిర్యాదులు అందాయని…వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.