వక్ఫ్ ఆస్తులను లీజ్ ఆక్షన్ కి పిలుస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులకు రెంట్ రివిజన్ చేయబోతున్నాం.

వ‌క్ఫ్ ఆదాయాన్ని పెంచి ముస్లిం సమాజాభివృద్ధికి తోడ్పడుతాం.

షేక్. అబ్దుల్ అజీజ్,. ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు.

వక్ఫ్ ఆస్తులను లీజ్ ఆక్షన్ కి పిలుస్తాం..!!

-రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులకు రెంట్ రివిజన్ చేయబోతున్నాం.
-వ‌క్ఫ్ ఆదాయాన్ని పెంచి ముస్లిం సమాజాభివృద్ధికి తోడ్పడుతాం.

  • షేక్. అబ్దుల్ అజీజ్,. ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు.

నెల్లూరు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద గల బార్కాస్ మసీద్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులకు స్వయం పరిపాలన కోసం కొన్ని షాపులు ఉంటాయని, ఆ షాపులను తక్కువ అద్దెకు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. మార్కెట్ రేటు కు సమానంగా అద్దెకు ఇచ్చి.. తద్వారా వచ్చిన ఆదాయాన్ని ముస్లిం సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులకు రెంట్ రివిజన్ చేయబోతున్నామని, మార్కెట్ ధరలకు సమానంగా అద్దెలను రివైజ్ చేయబోతున్నామని తెలిపారు. ప్ర‌ధానంగా.. త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణ‌ల‌కు గురికాని 30 వేల ఎకరాలకు లీజు ఆక్షన్ ను పబ్లిష్ చేయబోతున్నామని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గతంలో వక్ఫ్ ఆస్తిని పరిశ్రమకు ఇవ్వబోతే.. అడ్డుకున్నారని ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా.. అది అలాగే ఖాళీగా ఉందని.. ఎటువంటి ఆదాయం రాకుండా మారిందని అన్నారు. ఈసారి అలాంటి అవకాశాలు ఇవ్వబోమని.. ప్రతి అంగుళం భూమిని ఉపయోగం లోకి తీసుకొస్తామని.. కుల మతాలకతీతంగా లీజులకు అందజేస్తామని తెలిపారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని ముస్లిం సమాజ అభివృద్ధికి ఉపయోగిస్తామని.. ముస్లిం బిడ్డల చదువులకు వితంతువులకు వారి అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *