బొబ్బ‌ల‌…మా డ‌బ్బులు మాకు తిరిగిచ్చే

డ‌బ్బులివ్వ‌మ‌ని అడిగితే రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదు

మీడియా ఎదుట బాధితుల ఆవేద‌న

బొబ్బ‌ల‌…మా డ‌బ్బులు మాకు తిరిగిచ్చే…

  • డ‌బ్బులివ్వ‌మ‌ని అడిగితే రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదు
  • మీడియా ఎదుట బాధితుల ఆవేద‌న

తమకు పర్మినెంట్ లైన్మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ తమ నుంచి తీసుకున్న 11.50 లక్షల రూపాయలు తమకు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు సరస్వతి నగర్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తమ నుంచి రూ. 11:30 లక్షల నగదు తీసుకున్నారని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాము పర్మినెంట్ ఉద్యోగాల కోసం బొబ్బలకు ఇచ్చిన నగదు గురించి మీడియా సమావేశంలో అడిగితే బొబ్బల శ్రీనివాస యాదవ్ రాజకీయంగా ఎమ్మెల్యే పై ఆయన తమ్ముడు పై విమర్శలు చేయడం తగదన్నారు. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు బాగా లేవని తాము పర్మినెంట్ ఉద్యోగాల పేరుతో బొబ్బల తీసుకున్న నగదుకు సంబంధించి పోలీస్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *