కావలి, కందుకూరు, కొండాపురంలో పది పరీక్షలకు కట్టుదిట్ట ఏర్పాట్లు
దగ్గరుండి కేంద్రాల వద్ద విద్యార్థులను వదిలిపెట్టిన తల్లిదండ్రులు
ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
- కావలి, కందుకూరు, కొండాపురంలో పది పరీక్షలకు కట్టుదిట్ట ఏర్పాట్లు
- దగ్గరుండి కేంద్రాల వద్ద విద్యార్థులను వదిలిపెట్టిన తల్లిదండ్రులు
విద్యార్థుల జీవితంలో ఎదుర్కొనే తొలిమెట్టు పరీక్ష పదోతరగతి పరీక్షలు. తొలిసారి కావడంతో విద్యార్థులకు కాస్త బెరుకు ఉండడం సహజం. దీంతో ఇటు ఉపాద్యాయులు, అటు తల్లిదండ్రులు వారికి ధైర్యంగా ఉంటుందని పరీక్షా కేంద్రాల వద్దకు దగ్గరుండి వదిలిపెట్టి వెళ్లారు. కావలి, కందుకూరు, కొండాపురం మండలాల్లో సోమవారం పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కల్పించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.