ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు అందుబాటులో ఉంటా..ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుంటా

ఎమ్మెల్సీ, వైసీపీ న‌గ‌ర ఇన్‌ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి

11వ డివిజ‌న్ ఇన్‌ఛార్జిగా సంప‌త్ మ‌హేష్‌

డివిజ‌న్‌లో ప‌ర్వ‌త‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు అందుబాటులో ఉంటా..
ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుంటా..!!
-ఎమ్మెల్సీ, వైసీపీ న‌గ‌ర ఇన్‌ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి
-11వ డివిజ‌న్ ఇన్‌ఛార్జిగా సంప‌త్ మ‌హేష్‌

-డివిజ‌న్‌లో ప‌ర్వ‌త‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

నెల్లూరు న‌గ‌రంలో వైసీపీ బ‌లోపేతం దిశ‌గా ఎమ్మెల్సీ, న‌గ‌ర ఇన్‌ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ముందుకెళ్తున్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన డివిజ‌న్ ఇన్‌ఛార్జుల‌ను నియ‌మిస్తున్నారు. ఇప్ప‌టికే నెల్లూరు న‌గ‌రంలో ప‌లు డివిజ‌న్ ఇన్‌ఛార్జుల జాబితాను సిద్ధం చేశారు. కొంద‌ర్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నెల్లూరు న‌గ‌రంలోని 11వ డివిజ‌న్ ఇన్‌ఛార్జిగా సంప‌త్ మ‌హేష్‌ను ప్ర‌క‌టించారు. దీంతో ఆదివారం రాత్రి 11వ డివిజ‌న్‌లోని ఎన్టీఆర్ న‌గ‌ర్‌లోని సంప‌త్ మ‌హేష్ నివాసం వ‌ద్ద చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి అభినంద‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి స్థానిక వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, మ‌హిళ‌లు పెద్ద ఎత్తున ఘ‌న స్వాగ‌తం పిలికారు. దారిపొడ‌వూనా పూలు జ‌ల్లుతూ.. జై వైఎస్ఆర్‌, జై.. జ‌గ‌న్‌..జై జై చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని భారీ పూల మాల‌లు, శాలువాల‌తో స‌త్క‌రించారు. అనంత‌రం ఆయ‌న సంప‌త్ మ‌హేష్‌ను ఇన్‌ఛార్జిగా ప్ర‌క‌టించారు. త‌ర్వాత మాట్లాడారు.

టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. 20 మంది వైసీపీ కార్పోరేట‌ర్లు టీడీపీలోకి వెళ్లార‌ని.. దాంతో అంతా న‌గ‌రంలో వైసీపీ ప‌నైపోయింద‌న్నార‌ని.. ప‌త్రిక‌ల్లో రాశార‌ని.. అది చూసి న‌వ్వొచ్చింద‌న్నారు. ప్ర‌తిప‌క్షంలో ప‌నిచేయ‌డ‌మే సంతోషంగా ఉంద‌న్నారు. తాము ఎవ‌రి జోలికీ వెళ్ల‌మ‌ని.. మా జోలికి.. మా కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే మాత్రం వ‌దిలిపెట్టం అన్నారు. అలాగే.. రానున్న రోజుల్లో న‌గ‌రంలో పార్టీ బ‌లోపేతానికి ప్ర‌ణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామ‌ని.. ఎవ‌రికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. అందుబాటులో ఉంటాన‌ని.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ముందుండి పోరాడ‌తామ‌ని ఈసంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు.. రానున్న‌రోజుల్లో న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాన‌ని ఎవ‌రైనా న‌న్ను వ‌చ్చి నేరుగా క‌ల‌వొచ్చన్నారు. ఈకార్య‌క్ర‌మంలో ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు పేర్నేటి కోటేశ్వ‌ర‌రెడ్డి, య‌వ‌జ‌న నేత ఊటుకూరు నాగార్జున‌, సిద్ధిక్‌, ఏలూరు మ‌హేష్‌, చీదేళ్ల కిష‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *