చంద్రబాబు ఆశయానికి ఇలా బాటలు వేద్దాం

శాసనసభలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గళం

ప్రతి జిల్లా కేంద్రంగా సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కావాలి

మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి చదివించిన యువతకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి కల్పించాలి

స్వర్ణాంద్ర @ 2047 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వున్న విజన్ కి నిదర్శనమన్న కావలి ఎమ్మెల్యే

చంద్రబాబు ఆశయానికి ఇలా బాటలు వేద్దాం..!

-శాసనసభలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గళం
-ప్రతి జిల్లా కేంద్రంగా సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కావాలి
-మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి చదివించిన యువతకు
-ఇక్కడే ఉద్యోగ ఉపాధి కల్పించాలి.
-స్వర్ణాంద్ర @ 2047 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వున్న

విజన్ కి నిదర్శనమన్న కావలి ఎమ్మెల్యే

ఆశతో ఉన్న నాయకుడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు జగన్ లా..
ఆశయంతో ఉన్న నాయకుడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు ముఖ్యమంత్రి చంద్రబాబులా..
అని శాసనసభలో సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన గళం విప్పారు. ఆయన ముఖ్యమంత్రి ప్రకటించిన స్వర్ణాంద్ర @ 2047 పై, రాష్ట్ర అభివృద్ధిలో ఏం చేస్తే బాగుంటుందో సభ దృష్టికి తెచ్చారు. కొత్త దారులు సృష్టిస్తూ ప్రజలను ఆ వైపు నడిపించడమే నిజమైన నాయకత్వం అన్నారు. ముఖ్యమంత్రి స్వర్ణాంద్ర @ 2047 డాక్యుమెంటరీ ఒక నాయకుడికి ఉన్న విజన్ కు నిదర్శనంగా ఉందన్నారు. సాఫ్ట్ వేర్ రంగం, పరిశ్రమలు లేక మన రాష్ట్రం వెనుకబడి ఉందని,గత ఐదేళ్ల విధ్వంస పాలనతో ఉద్యోగ అవకాశాలు అసలు పూర్తిగా
లేవన్నారు. మన రాష్ట్రంలో బిడ్డ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు చదివించి తీర్చిదిద్ధితే అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ సంపద సృష్టిస్తున్నట్లు చెప్పారు. వీరికి జిల్లా కేంద్రంగా

సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కావాలని, పరిశ్రమలు తెచ్చి ఇక్కడే పన్నులు కట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా చూడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *