కావలి ఆర్డీవో పై రైతులు ఫైర్

బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిక

కావలి ఆర్డీవో, ఎమ్మెల్యేకు తెలియకుండా డిక్లేరేషన్ ప్రకటన ఎలా వస్తుంది…?

రామాయపట్నం పోర్టు అనుసంద పరిశ్రమల భూసేకరణపై ఆనెమడుగు గ్రామస్థుల ఆందోళన.

మద్దతు పలికిన వ్యవసాయ కార్మిక సంఘం

కావలి ఆర్డీవో పై రైతులు ఫైర్ !

-బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిక
-కావలి ఆర్డీవో, ఎమ్మెల్యేకు తెలియకుండా డిక్లేరేషన్ ప్రకటన ఎలా వస్తుంది…?
-రామాయపట్నం పోర్టు అనుసంద పరిశ్రమల భూసేకరణపై ఆనెమడుగు గ్రామస్థుల ఆందోళన.

-మద్దతు పలికిన వ్యవసాయ కార్మిక సంఘం

కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం ఐదు గ్రామాల ప్రజల నిరసనతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆర్డీవో వంశీ కృష్ణ పై కావలి మండలం అనెమడుగు పంచాయతీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా, గ్రామసభలో తీర్మానం లేకుండా బలవంతంగా భూసేకరణ చేసేందుకు ఏ విధంగా డిక్లేరేషన్ ప్రకటన ఇచ్చారని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు అనుసందానంగా పరిశ్రమలకు ఆనెమడుగులో చేయనున్న 738 ఎకరాల భూసేకరణ తీరుపై గ్రామస్థుల ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతుగా నిలిచారు. కావలి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రతి పక్షంలో ఉండగా మీ భూములు కాపాడతామని, అధికారంలోకి వచ్చాక రైతులను, కూలీలను మోసం చేస్తారా అంటూ ప్రశ్నించారు. మూడు కార్లు పంటలు పండించుకునే భూములని, ఎవరో కాకినాడ పారిశ్రామిక వేత్త కోసం రైతులను బలి చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకమ్మ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మాల్యాద్రి మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *