క‌లెక్ట‌ర్ సార్‌….స్పందించండి

ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద వ‌స‌తులు నిల్‌…

ఎండ‌ల‌కి అల్లాడిపోతున్న త‌ల్లిదండ్రులు

సెంట‌ర్ల వ‌ద్ద నిలువ నీడ‌లేదు.. తాగేందుకు నీళ్లు కూడా లేవు

అధికారులు, సిబ్బంది తీరుపై త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం

క‌లెక్ట‌ర్ సార్‌….స్పందించండి

  • ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద వ‌స‌తులు నిల్‌…
  • ఎండ‌ల‌కి అల్లాడిపోతున్న త‌ల్లిదండ్రులు
  • సెంట‌ర్ల వ‌ద్ద నిలువ నీడ‌లేదు.. తాగేందుకు నీళ్లు కూడా లేవు

– అధికారులు, సిబ్బంది తీరుపై త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం

నేటి నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 174 ప‌రీక్షా కేంద్రాల‌ను అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 34,434 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద‌కు విద్యార్థుల‌తో పాటు త‌మ త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు వ‌స్తున్నారు. వారంద‌రూ ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద విద్యార్థుల కోసం గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉంటున్నారు. అయితే కొన్ని ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద స‌రైన వ‌స‌తులు ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లే మార్చినెల సూర్యుడు ఇప్ప‌టికే త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. మండుటెండ‌లో.. ప‌రీక్షా కేంద్రాల గేట్ల వ‌ద్ద‌నే త‌మ పిల్ల‌ల కోసం వేచి చూస్తూ.. అల్లాడిపోతున్నారు. అలాగే సెంట‌ర్ల వద్ద తాగేందుకు నీళ్ల‌ను కూడా అధికారులు ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంపై విద్యార్థులు, త‌ల్లిదండ్రులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. నెల్లూరు న‌గ‌రం.. మ‌ద్రాసు బ‌స్టాండు స‌మీపంలోని సుంకు చెంగ‌న్న చెట్టి సైక్లోన్ ఆర్భ‌నేజ్ న‌గ‌ర పాల‌క హైస్కూల్ గేటు బ‌య‌టే…విద్యార్థుల రాక కోసం త‌ల్లిదండ్రులు వేచి చూస్తున్నారు. ఓ ప‌క్క స‌రైన పారిశుద్ధ్యం లేక‌పోవ‌డం.. ఎక్క‌డి చెత్త అక్క‌డే ఉండ‌టం..తోపాటు నిలువ నీడ కూడా లేక‌పోవ‌డంతో.. విద్యార్థుల త‌ల్లిదండ్రులు, వారి కుటుంబ స‌భ్యులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. క‌లెక్ట‌ర్ ఆనంద్ సార్‌.. వెంట‌నే స్పందించి.. విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో..వ‌స‌తులు లేని ప‌రీక్షా కేంద్రాల క‌నీసం షామియానాలు, తాగేందుకు నీరు ఏర్పాటు చేయాల‌ని వారు కోరుతున్నారు. ఈనెలాఖ‌రు వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. క‌నీస సౌక‌ర్యాలైనా క‌ల్పించాల‌ని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *