ఆగని తెల్లరాయి తరలింపు

దుత్త‌లూరులో లారీని ప‌ట్టుకున్న పోలీసులు

ఆగని తెల్లరాయి తరలింపు…

  • దుత్త‌లూరులో లారీని ప‌ట్టుకున్న పోలీసులు

తెల్లరాయి అక్రమార్కులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పర్మిషన్ లేకుండా య‌దేచ్చేగా రాష్టాలు దాటిస్తున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీల్లో భాగంగా… నెల్లూరు జిల్లా దుత్తలూరు సెంటర్ లో అక్రమంగా తరులుతున్న తెల్లరాయి లారీని దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి పట్టుకొని స్టేషన్ కి తరలించారు. ఈ విషయంపై ఎస్ఐ ఆదిలక్ష్మిని వివరణ కోరగా… ఓవర్ లోడ్ తో వెళుతున్న లారీని పట్టుకొని త‌నిఖీ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించ‌డం జ‌జ‌రిగింద‌న్నారు. పర్మిట్ కాగితాలను పరిశీలించి మైనింగ్ డిపార్ట్మెంట్ కి తెలియజేశామని ఆమె పేర్కొన్నారు. ఎవ‌రైనా తెల్ల‌రాయిని అక్ర‌మంగా త‌ర‌లిస్తే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్ఐ హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *