ఎంపీపి చింతం రెడ్డి పద్మావతి
సీతారామపురంలో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంఖుస్థాపన
రూ 2.25కోట్లతో మండల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఎంపీపి చింతం రెడ్డి పద్మావతి
- సీతారామపురంలో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంఖుస్థాపన
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తునట్లు ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అన్నారు. మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలోరూ.2.25 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.గ్రామంలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఎంపిపి తెలిపారు. నెల్లూరు జిల్లా
సీతారామపురం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఆర్వో ప్లాంట్స్,సీసి రోడ్లు,రచ్చబండ అభివృద్ధి నిర్మాణ పనులుకు ఎంపిపి వైసీపీ మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డితో కలసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ఈ పనులును అధికారులు,కాంట్రాక్టర్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ జట్పిటీసి దుగ్గిరెడ్డి గురవారెడ్డి,ఎంపిటిసి పీసి అల్లూరు రాజు,సర్పంచ్ దుర్గాప్రసాద్,నాయకులు రామ్మోహన్ రెడ్డి, బాలినేని మాబయ్య,లకిడి బ్రహ్మయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.