ఆ మహనీయుని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి
జిల్లాకు ఆ ధన్యజీవి పేరు పెట్టడం మనందరికి గర్వకారణం – కలెక్టర్ ఆనంద్
ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
పొట్టి శ్రీరాములు త్యాగాలు అజరామరం
- ఆ మహనీయుని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి
- జిల్లాకు ఆ ధన్యజీవి పేరు పెట్టడం మనందరికి గర్వకారణం
- కలెక్టర్ ఆనంద్
- ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు త్యాగాలు చరిత్రలో అజరామరంగా నిలిచి ఉంటాయని కలెక్టర్ ఆనంద్ అన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ ఆనంద్, కమిషనర్ సూర్య తేజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగాలు అజరామరమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో దేశంలోనే గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆ మహనీయుని పోరాటస్ఫూర్తితోనే మనదేశంలో భాష ఆధారంగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. అనంతరం కమిషనర్ సూర్యతేజ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, పలువురు ఆర్యవైశ్య నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.