రథోత్సానికి పోటెత్తిన భక్తజనం
గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధులు
కిటకిటలాడిన రంగనాయకులపేట
ఆకట్టుకున్న కేరళ వాయిధ్యం
కమనీయం రంగడి రథోత్సవం…
- రథోత్సానికి పోటెత్తిన భక్తజనం
- గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధులు
- కిటకిటలాడిన రంగనాయకులపేట
- ఆకట్టుకున్న కేరళ వాయిధ్యం
నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రంగనాథస్వామి వారి రథోత్సవం కమనీయంగా సాగింది. రంగడి రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. దీంతో రంగనాయకులపేట భక్తులతో కిటకిటలాడింది. రథోత్సవంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ ఓ నందన్, నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, పలువురు ప్రముఖులు విచ్చేసి… గుమ్మడి కాయలు కొట్టి…రథంపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లను దర్శించి…రథోత్సవాన్ని ప్రారంభించారు. కేరళ వాయిధ్యాల నడుమ…జై రంగనాథస్వామికి…జై… గోవింద… గోవింద అంటూ నామస్మరణలు చేస్తూ…వేలాది మంది భక్తులు రంగడి రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి…కర్పూర హారతలు వెలిగించి…స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా…జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు… నెల్లూరు సిటీ డీఎస్పీ సింధుప్రియ పర్యవేక్షణలో… గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం నుడా చైర్మన్ భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉత్సవాలను ఆలయ చైర్మన్ ధర్మకర్తల మండలి, కార్యనిర్వహణాధికారి, సభ్యుల పర్యవేక్షించారు.