హడ్కో సీఎండీకి స్వాగతం పలికిన ఎంపీ బాలశౌరి, మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి కీలక ఒప్పందం…
- హడ్కో సీఎండీకి స్వాగతం పలికిన ఎంపీ బాలశౌరి, మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణకై Housing and Urban Development Corporation Ltd, సీఆర్డీయే మధ్య కీలక ఒప్పందం జరగనుంది. ఈ నేపథ్యంలో హడ్కో సీఎండీ సుంజయ్ కుల్ శ్రేష్ఠ విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకి ఎంపీ బాలశౌరి, మంత్రి పొంగూరు నారాయణలు ఘన స్వాగతం పలికారు. అమరావతి నిర్మాణానికి హడ్కో రూ. 11,000 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హడ్కో సీఎండీతో పలు విషయాలను వారు సుదీర్ఘగంగా చర్చించారు. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం పొందినట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో, సీఆర్డీయే మధ్య ఒప్పందం కుదరనుందన్నారు. ఒప్పందం పూర్తయిన వెంటనే హడ్కో నిధులు విడుదల చేయనుందని చెప్పారు. హడ్కో సీఎండితో పాటు డైరెక్టర్ నాగరాజ్, ఫైనాన్స్ డైరెక్టర్ దళ్జిత్ సింగ్ ఖాత్రీ విజయవాడకు చేరుకున్నారు.