20వేలు ఫైన్‌…ఆరేళ్లు జైలు

దుకాణ‌దారుల‌కి ఎమ్మెల్యే కురుగొండ్ల హెచ్చ‌రిక‌

వెంక‌ట‌గిరిలో స్వ‌ర్ణ ఆంధ్ర

స్వ‌చ్ఛ ఆంధ్ర‌ – సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై అవ‌గాహ‌న ర్యాలీ

20వేలు ఫైన్‌…ఆరేళ్లు జైలు

  • దుకాణ‌దారుల‌కి ఎమ్మెల్యే కురుగొండ్ల హెచ్చ‌రిక‌
  • వెంక‌ట‌గిరిలో స్వ‌ర్ణ ఆంధ్ర – స్వ‌చ్ఛ ఆంధ్ర‌
  • సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై అవ‌గాహ‌న ర్యాలీ

రాష్ట్ర ప్ర‌భుత్వం పిలుపు మేర‌కు…వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో… స్వ‌ర్ణ ఆంధ్ర – స్వ‌చ్ఛ ఆంధ్ర కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేతోపాటు… మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నక్క భానుప్రియ, మండల ఎంపీపీ తనుజ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు విద్యార్థులు, పారిశుధ్య కార్మికుల‌తో క‌లిసి ప‌ట్ట‌ణంలో ర్యాలీ చేప‌ట్టి… స్వ‌ర్ణ ఆంధ్ర – స్వ‌చ్ఛ ఆంధ్ర కార్య‌క్ర‌మంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌ధాన కూడ‌లి వ‌ద్ద స్కూల్ విద్యార్థుల‌తో మాన‌వ‌హారం చేప‌ట్టి…ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌తిజ్ఞ చేయించారు. అనంత‌రం ఎమ్మెల్యే ప‌ట్ట‌ణంలోని ప‌లు దుకాణ‌దారుల వ‌ద్ద‌కు వెళ్లి ప్లాస్టిక్ వాడ‌కంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్లాస్టిక్ క‌వ‌ర్లు నిషేద‌మ‌ని…క్లాత్ సంచులే వాడాల‌ని సూచించారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే వారికి రూ. 20వేల జ‌రిమానాతోపాటు ఆరేళ్లు జైలు శిక్ష ప‌డుతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ మాట్లాడుతూ….ప్ర‌జ‌లు, దుకాణ‌దారులు ప్లాస్టిక్ వాడ‌కాన్ని త‌గ్గించాల‌న్నారు. లేని ప‌క్షంలో దుకాణాల‌పై ఆక‌స్మిక దాడులు జ‌రిపి పెద్ద మొత్తంలో జ‌రిమానాలు విధిస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *