శ్రీనివాసుడి కళ్యాణానికి సీఎం చంద్రబాబుని ఆహ్వానించిన టీటీడీ పాలక వర్గం
సిఎంకి ఆహ్వాన పత్రిక అందచేసిన టిటిడి బోర్డు సభ్యురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
సీఎంని ఆహ్వానించిన వేమిరెడ్డి
- శ్రీనివాసుడి కళ్యాణానికి సీఎం చంద్రబాబుని ఆహ్వానించిన టీటీడీ పాలక వర్గం
- సిఎంకి ఆహ్వాన పత్రిక అందచేసిన టిటిడి బోర్డు సభ్యురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాళెంలో మార్చి 15 న టిటిడి ఆధర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్బంగా టిటిడి బోర్డు పాలకవర్గం, ఆధికారులు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. అనంతరం రేపు జరగనున్న శ్రీవారి కళ్యానోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. శ్రీవారి కళ్యానోత్సవ కన్వీనర్, టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సిఎం చంద్రబాబు నాయుడుకి ఆహ్వాన పత్రిక అందచేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ బి ఆర్ నాయుడు, టిటిడి ఇ ఓ శ్యామల రావు, జె ఇ ఓ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.