వీధుల్ని శుభ్రం చేసిన అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు

గూడూరులో స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర‌

వీధుల్ని శుభ్రం చేసిన అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు

  • గూడూరులో స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర‌

రాష్ట్ర ప్ర‌భుత్వం పిలుపు మేర‌కు… తిరుప‌తి జిల్లా గూడూరు కోర్ట్ సెంట‌ర్‌లో ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు స‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. స్థానిక ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేర‌కు… తిరుప‌తి జిల్లా అధికార ప్ర‌తినిధి బిల్లు చెంచురామ‌య్య‌, టీడీపీ నాయ‌కులు మ‌స్తాన్ నాయుడు, ముమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర్లు, మ‌ధులు మున్సిపాలిటీ సిబ్బందితో క‌లిసి… ప‌ట్ట‌ణంలో ర్యాలీ నిర్వ‌హించి స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రూ కోర్టు సెంట‌ర్ లో వీధుల‌న్నింటిని శుభ్రం చేశారు. అనంత‌రం వారు మాట్లాడారు. ప్ర‌తీ ఒక్క‌రూ స్వ‌ర్ణాంధ్ర -స్వ‌చ్ఛంధ్ర కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు. త‌మ త‌మ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *