ఆరోపణలున్న వారిద్దరిపై ఎందుకు విచారణ చేపట్టలేదు?
మీడియా మీట్లో కోరిన డీఏఏబీ మాజీ ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్బాబురెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి
లక్షలు గుంజుకుంటున్నారు
- ఆరోపణలున్న వారిద్దరిపై ఎందుకు విచారణ చేపట్టలేదు?
- మీడియా మీట్లో కోరిన డీఏఏబీ మాజీ ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్బాబురెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరులోని వైసీపీ కార్యాలయంలో వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఏఏబీ మాజీ ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్బాబురెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి మాట్లాడారు. ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఈవోపీఆర్డీ, పంచాయతీ సెక్రెటరీ కలిసి కింది స్థాయి అధికారులను ఇబ్బందులు పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. వీరిపై పలు ఆరోపణలు ఉన్నప్పటికీ ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. పోర్జరీ సంతకాలు చేసి పడుగుపాడు కార్యదర్శికి నోటీసులు అందజేసిన ఈవోపీఆర్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శి వార్డ్ మెంబర్లకు తెలియకుండానే సమావేశాలు పలు కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలపై కూడా అసభ్యకరంగా కోవూరు సెక్రెటరీ ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కవరిగిరి శ్రీలత, ప్రసాద్, ఉప ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.