ఉద్యోగాలు ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు
తమకు న్యాయం చేయాలి
మీడియా సమావేశంలో పలువురు బాధితులు ఆవేదన
మమ్మల్ని బొబ్బల మోసం చేశాడు…
- ఉద్యోగాలు ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు
- తమకు న్యాయం చేయాలి
- మీడియా సమావేశంలో పలువురు బాధితులు ఆవేదన
నెల్లూరు రూరల్ 37వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తమకు పర్మినెంట్ షిఫ్ట్ లైన్ మెన్ పోస్టులు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేశాడని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు రూరల్ సరస్వతి నగర్ సబ్ స్టేషన్ వద్ద వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 37వ డివిజన్ కి చెందిన బొడ్డేపల్లి జగ్గారావు, అవినాష్, వంశీకృష్ణలు మాట్లాడారు. గత ప్రభుత్వ హయంలో తనకు రాజకీయ పలుకుబడి ఉందని చెప్పి, పర్మినెంట్ ఉద్యోగాల పేరుతో తమ వద్ద మొత్తం రూ. 8 లక్షల నగదు తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై 2024 జూన్ 21న కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్ని పత్రికల్లో కూడా వచ్చిందన్నారు. తాము వడ్డీలకు తెచ్చి ఈ డబ్బులు ఇచ్చామని జిల్లా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి తమ నగదు తమకు వచ్చేలా చూడాలని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.